తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్.. ఈ నెల 16, 17న హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాల ఏర్పాటు
- 17న విలీన దినోత్సవానికి హాజరవనున్న సోనియా
- అక్టోబరు 2 నుంచి నెల పాటు కీలక నేతల బస్సుయాత్ర
- అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన అగ్రనేతలు
మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశం చివరి రోజు సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సమావేశాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సైరన్ మోగించనుంది. మొత్తం 100 మందికి పైగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలు తెలంగాణవ్యాప్తంగా పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. అలాగే, అక్టోబరు 2 నుంచి టీపీసీసీ బస్సు యాత్ర చేపట్టింది. ఈ నెల రోజుల పాటు జరిగే ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, టి.జీవన్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర కీలక నేతలంతా పాల్గొనున్నారు.