Teachers: సెప్టెంబరు 2 నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు

  • ఇటీవల తెలంగాణ హైకోర్టు తుది తీర్పు
  • స్టే ఎత్తివేసిన న్యాయస్థానం
  • టీచర్ల బదిలీలకు తొలగిన అడ్డంకులు
  • రేపటిలోగా షెడ్యూల్ విడుదల చేయనున్న విద్యాశాఖ
Teachers transfers takes place in Telangana from September 2

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు కసరత్తులు చేస్తోంది. సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో టీచర్ల బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇటీవల టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపడంతో కేసీఆర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. తుది తీర్పునకు లోబడే బదిలీలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ విద్యాశాఖ రేపటి లోగా షెడ్యూల్ విడుదల చేయనుంది. 

ఈ బదిలీ ప్రక్రియలో... భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులైతే వారికి అదనపు పాయింట్లు కేటాయించనున్నారు. టీచర్ల బదిలీలపై జనవరిలోనే షెడ్యూల్ విడుదలైంది. హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే న్యాయస్థానం స్టే ఎత్తివేయడంతో బదిలీలకు అవరోధాలు తొలగిపోయాయి.

More Telugu News