Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 110 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా లాభపడ్డ ఎల్ అండ్ టీ షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆ తర్వాత కొనుగోళ్ల అండతో పుంజుకుని లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్లు లాభపడి 64,996కి చేరుకుంది. నిఫ్టీ 40 పాయింట్లు పుంజుకుని 19,306 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.95%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.01%), సన్ ఫార్మా (0.89%), మారుతి (0.87%). 

టాప్ లూజర్స్:
రిలయన్స్ (-1.11%), నెస్లే ఇండియా (-0.97%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.67%), టైటాన్ (-0.59%), ఐటీసీ (-0.56%).

More Telugu News