రోజా, శాంతి మధ్య సయోధ్య కుదిర్చేందుకు జగన్ యత్నం

  • నగరిలో రోజా, శాంతి మధ్య విభేదాలు
  • ఇద్దరి చేతులు కలిపిన జగన్
  • చేతులు కలిపేందుకు ఇష్టపడని రోజా, శాంతి
నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి బటయటపడ్డాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే మంత్రి రోజా, మున్సిపల్ ఛైర్ పర్సన్ కేజే శాంతి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈరోజు నగరిలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రోజా, శాంతి మధ్య సయోధ్య కుదిర్చేందుకు జగన్ ప్రయత్నించారు. ఇద్దరి చేతులు పట్టుకుని కలిపారు. అయితే చేతులు కలిపేందుకు ఇద్దరూ ఆసక్తి చూపలేదు. చేయి కలిపిన వెంటనే రోజా తన చేతిని వెక్కి తీసుకోగా, రోజా ముఖాన్ని శాంతి అసలు చూడనే లేదు. దీంతో, సయోధ్య కుదిర్చేందుకు జగన్ చేసిన ప్రయత్నం విఫలమయిందనే చెప్పుకోవాలి. 


Roja
Shanthi
Jagan
YSRCP
Nagari

More Telugu News