ఆలయం శిఖరంపైనున్న బంగారు కలశం అదృశ్యం.. గుడివాడలో కలకలం
- గుడివాడలోని సిద్ధాంతం గ్రామంలోని బాలా త్రిపుర సుందరి ఆలయంలో ఘటన
- శనివారం ఆలయ పర్యవేక్షకులకు కలశం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
- చెట్టు కొమ్మలు తగిలి కిందపడ్డ కలశాన్ని కోతులు ఎత్తుకెళ్లిపోయి ఉండొచ్చని ఆలయ నిర్వాహకుల అనుమానం
- కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
కాగా, ఇటీవల కాలంలో ఆలయ శిఖరం వరకూ విస్తరించిన మర్రి చెట్టు కొమ్మలు ఈదురు గాలులకు కలశాలకు తగులుతున్నట్టు ఆలయ నిర్వహకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొమ్మలు తగిలి కింద పడ్డ కలశాన్ని కోతులు ఎటైనా తీసుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.