Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది!

  • తిరుమలలో రద్దీ సాధారణం
  • ఏడు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • సర్వదర్శనానికి 15 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం
  • బుధవారం ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.76 కోట్ల ఆదాయం
Devotees rush in Tirumala declines

గత కొన్ని రోజులుగా అధిక రద్దీ నెలకొన్న తిరుమలలో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీవారి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. గురువారం ఉదయం నాటికి స్వామివారి దర్శనానికి కేవలం 7 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం నాడు తిరుమల శ్రీవారిని 71,122 మంది దర్శించుకున్నారు. 29,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.76 కోట్ల ఆదాయం వచ్చింది.

More Telugu News