Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు... ఇద్దరి మృతి

  • అల్లూరి జిల్లాలో విషాద ఘటన
  • చోడవరం నుంచి పాడేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు
  • పాడేరు ఘాట్ రోడ్డులో వ్యూ పాయింట్ వద్ద ప్రమాదం
  • మలుపు తిరిగే క్రమంలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు
RTC Bus rams into a gorge in Alluri district

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాడేరు ఘాట్ రోడ్డులో ఈ ప్రమాద ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ బస్సు చోడవరం నుంచి పాడేరు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పాడేరు ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్ద మలుపు తిరుగుతుండగా, బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

More Telugu News