వరదలతో హిమాచల్ ప్రదేశ్ లో వేలాడుతున్న రైలు ట్రాక్ లు
- టాయ్ ట్రైన్ మార్గంలో కొట్టుకుపోయిన ట్రాక్ లు
- గాల్లో వేలాడుతూ కనిపిస్తున్న తీరు
- పునరుద్ధరణ పనులు చేపట్టిన రైల్వే శాఖ
ఈ రైల్వే ట్రాక్ ను కేవలం దేశ రైలు నెట్ వర్క్ లో భాగంగా కాకుండా, స్థానికులు తమ చిరకాల గుర్తులుగానూ చూస్తుంటారు. ఈ రైల్వే లైను కల్కా నుంచి సిమ్లా వరకు విస్తరించి ఉంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఇది కూడా ఒకటి. దీన్ని టాయ్ ట్రైన్ ట్రాక్ అని కూడా పిలుస్తారు. వందేళ్లకు పైగా చరిత్ర దీనికి ఉంది.
ఈ రైలు మార్గం 96 కిలోమీటర్ల పొడవునా ఉంటుంది. కల్కా నుంచి మొదలై సిమ్లా చేరుకుంటుంది. ఈ మార్గంలో ఎన్నో పర్వాలను అదిదాటుతూ వెళుతుంది. మొత్తం ఐదు గంటల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుంది. దెబ్బతిన్న రైలు ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ చేపట్టింది. వరదలు, ప్రకృతి విపత్తుల వల్ల హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, రూ.10వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించడం తెలిసిందే.