Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • లాభాల్లో రియాల్టీ, పవర్, ఐటీ, హెల్త్ కేర్ తదితర సూచీలు
  • 138 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 31 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలలో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 138 పాయింట్లు లాభపడి 65,539కి చేరుకుంది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 19,465 వద్ద స్థిరపడింది. రియాల్టీ, పవర్, ఐటీ, హెల్త్ కేర్ తదితర సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.44%), ఎన్టీపీసీ (2.14%), టాటా మోటార్స్ (1.92%), ఇన్ఫోసిస్ (1.78%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.55%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-1.90%), భారతి ఎయిర్ టెల్ (-1.13%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.86%), యాక్సిస్ బ్యాంక్ (-0.67%), బజాజ్ ఫైనాన్స్ (-0.56%).

More Telugu News