Team India: ఏడేళ్ల తర్వాత భారత్‌ పై సిరీస్‌ సొంతం చేసుకున్న వెస్టిండీస్​

  • ఐదో టీ20లో ఓడిన టీమిండియా
  • విండీస్ ను గెలిపించిన బ్రెండన్ కింగ్‌
  • 3-2తో సిరీస్‌ గెలిచిన కరీబియన్‌ జట్టు 
India lose T20 series to Westindies after 7 years

వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచిన భారత్‌ కు టీ20ల్లో మాత్రం షాక్ తగిలింది. ఈ ఫార్మాట్‌లో వరుసగా 11 సిరీస్‌ విజయాలతో సాగుతున్న భారత జట్టు జోరుకు ఏడేళ్ల తర్వాత విండీస్ బ్రేక్‌ పడింది. నిన్నరాత్రి జరిగిన ఐదో టీ20లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో భారత్‌ పై నెగ్గింది. దీంతో సిరీస్‌ను 3-2తో సొంతం చేసుకుంది. 2016 తర్వాత టీమిండియా ఓ సిరీస్‌ నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ లో తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61) అర్ధ శతకంతో రాణించాడు. 

హైదరాబాదీ తిలక్ వర్మ (27) ఫర్వాలేదనిపించగా మిగతా బ్యాటర్లంతా నిరాశ పరిచాడు. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 నాటౌట్‌) దూకుడుగా ఆడటంతో విండీస్‌ 18 ఓవర్లలో 2 వికెట్లకు 171 పరుగులు చేసి సులువుగా గెలిచింది. నికోలస్ పూరన్‌ (35 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 47) కూడా రాణించాడు. నాలుగు వికెట్లు తీసిన రొమారియో షెఫర్డ్  కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్‌ లో టాప్ స్కోరర్ అయిన నికోలస్ పూరన్‌ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌ అవార్డులు లభించాయి.

More Telugu News