Undavalli Sridevi: అమరావతి రైతులతో నారా లోకేశ్ ముఖాముఖి... హాజరైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

  • తాడికొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • అమరావతి ఆవేదన పేరిట రైతులతో లోకేశ్ భేటీ
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలు
  • ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేసిన వైసీపీ అధిష్ఠానం
  • టీడీపీకి దగ్గరవుతున్న ఉండవల్లి శ్రీదేవి
MLA Undvalli Sridevi attends Nara Lokesh meeting with Amaravati farmers

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గంలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమరావతి ఆవేదన పేరిట లోకేశ్ అమరావతి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా హాజరయ్యారు. సొంత నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆమే సంధానకర్తగా వ్యవహరించడం విశేషం.

ఉండవల్లి శ్రీదేవి గత కొంతకాలంగా టీడీపీ వర్గాలకు సన్నిహితంగా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై వైసీపీ అధినాయకత్వం సస్పెండ్ చేసినవారిలో ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. ఇవాళ ఆమె నారా లోకేశ్ కార్యక్రమానికి హాజరవడంతో వచ్చే ఎన్నికల్లో ఆమె ఏ పక్షమో స్పష్టమైంది.

More Telugu News