Indian Railways: హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో 20 రైళ్లు రద్దు

  • వారం పాటు 20 రైలు సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించిన రైల్వే శాఖ
  • ఈ నెల 14-20 మధ్య 18 సర్వీసులు, 15-21 మధ్య రెండు సర్వీసులు రద్దు 
  • నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు వెల్లడి
  • 22 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు చేసినట్టు ప్రకటన
Railway department suspends 20 trains over a week for track maintenance workds

నిర్వహణ పనులు జరుగుతున్న కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేసినట్టు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 20 వరకూ 18 రైళ్లు, 15  నుంచి 21 తారీఖుల మధ్య మరో రెండు రైళ్లు రద్దు చేసినట్టు వివరించింది. 

రైల్వే శాఖ ప్రకటన ప్రకారం, కాజీపేట-డోర్నకల్-కాజీపేట, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్, భద్రాచలంరోడ్-విజయవాడ-భద్రాచలంరోడ్, కాజీపేట-సిర్పుర్‌టౌన్, బళ్లార్ష-కాజీపేట, భద్రాచలంరోడ్-బళ్లార్ష, సిర్పుర్‌టౌన్-భద్రాచలంరోడ్, సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్, సిర్పుర్‌టౌన్-సికింద్రాబాద్-సిర్పుర్‌టౌన్, కరీంనగర్-నిజామాబాద్-కరీంనగర్, కాజీపేట-బళ్లార్ష-కాజీపేట, కాచిగూడ-నిజామాబాద్-కాచిగూడ రైళ్లు రద్దయ్యాయి. ఇక హైదరాబాద్‌లో ఈ నెల 14 నుంచి 20 వరకూ 22 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

More Telugu News