Bonda Uma: బొత్స కుటుంబ సభ్యులు సహా 50 మంది మాతో టచ్‌లో ఉన్నారు: బొండా ఉమ

  • ఉగాది నాటికి టీడీపీ, జనసేన ఉండవన్న బొత్సకు బొండా కౌంటర్
  • రాబోయే ఎన్నికల్లో బొత్సను చీపురుపల్లిలో ఓడిస్తామని సవాల్
  • వైసీపీకి గెలుపుపై నమ్మకం ఉంటే ఇప్పుడే ఎన్నికలు పెట్టాలని వ్యాఖ్య
Bonda Uma YSRCP MLAs in touch with TDP

వచ్చే ఉగాది నాటికి టీడీపీ, జనసేన పార్టీలు ఉండవని, ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని సవాల్ చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమ స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్సను, విజయనగరంలో ఆయన తమ్ముళ్లు, కుటుంబ సభ్యులను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నుండి బొత్స కుటుంబ సభ్యులు సహా యాబై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కూడా ఆయన అన్నారు. వైసీపీకి అంత నమ్మకం ఉంటే ఉగాది వరకు కాదని, ఇప్పుడే ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు.

More Telugu News