Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు

  • జగదాంబ సెంటర్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అభియోగాలు
  • పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన అలా వ్యవహరించకూడదని స్పష్టీకరణ
  • బహిరంగ సభల్లో బాధ్యతగా మాట్లాడాలని సూచన
Visakha police notices to Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం జగదాంబ సెంటర్‌లో జరిగిన సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ మూర్తి... జనసేనానికి నోటీసులు జారీ చేశారు. నిన్నటి బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన అలా వ్యవహరించి ఉండకూడదని, బహిరంగ సభల్లో బాధ్యతగా మాట్లాడాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విద్వేష వ్యాఖ్యలు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సభలో వాలంటీర్లు, ఆంధ్రా యూనివర్సిటీపై ఆరోపణలు చేసిన జనసేనానికి సెక్షన్ 30 కింద నోటీసులు జారీ అయ్యాయి.

More Telugu News