Calcutta High Court: శివలింగం తొలగించాలని తీర్పు.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడంతో తీర్పు వెనక్కు తీసుకున్న జడ్జి!

  • కలకత్తా హైకోర్టులో భూవివాదం కేసులో అనూహ్య పరిణామాలు
  • వివాదాస్పద స్థలంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన శివలింగం 
  • దాన్ని తొలగించాలంటూ న్యాయమూర్తి తీర్పు
  • తీర్పు నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్  రిజిస్ట్రార్‌కు అకస్మాత్తుగా మూర్ఛ
  • వెంటనే తీర్పును ఉపసంహరించుకున్న న్యాయమూర్తి
  • దిగువ కోర్టులో తేల్చుకోవాలంటూ పిటిషనర్లకు సూచన
Calcutta High Court judge reverses remove shivling order as official recording verdict faints

ఓ వివాదాస్పద స్థలంలోని శివలింగం తొలగించాలంటూ ఆదేశించిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఆ మరుక్షణమే తన తీర్పును వెనక్కు తీసుకున్నారు. దీంతో, జడ్జి నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన గోవింద్ మండల్, సుదీప్ పాల్ అనే వ్యక్తుల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదాస్పద స్థలంలో అకస్మాత్తుగా శివలింగం కనిపించగా ఈ ఘటన వెనుక సుదీప్ మండల్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గోవింద్ హైకోర్టును ఆశ్రయించారు. 

విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ గుప్తా ఇరు వర్గాల వాదనలూ విన్నారు. అనంతరం, శివలింగం తొలగించాలంటూ తీర్పు వెలువరించారు. అయితే, జడ్జిమెంట్‌ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడంతో కలకలం రేగింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి తన తీర్పును ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా, ఈ వివాదంపై హైకోర్టు కలుగజేసుకోదని, కింది కోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించారు.

More Telugu News