ఎన్సీపీలో మళ్లీ కలకలం.. అమిత్ షాతో జయంత్ పాటిల్ రహస్య సమావేశం?
- ఆ వార్తల్లో నిజం లేదన్న పాటిల్
- ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్
- ఎన్సీపీని చీల్చాలన్న ఒత్తిడి తనపై లేదని వ్యాఖ్య
శనివారం సాయంత్రం తాను శరద్ పవార్ను కలిశానని, ఆదివారం ఉదయం కూడా మళ్లీ ఆయనతో భేటీ అయ్యానని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారు తాను ఏ సమయంలో అమిత్ షాను కలిశానో ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. పార్టీని చీల్చాలన్న ఒత్తిడి తనపై లేదని పాటిల్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా పాటిల్-షా భేటీ వార్తలను ఖండించారు.