పోటీలో నెం.2గా నిలిచినందుకు 15 ఏళ్ల బాలుడి విచారం.. కాసేపటికే గుండెపోటుతో మృతి

Student dies of cardiac arrest after feeling upset over finishing second in interschool relay race in Karnataka
  • కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఘటన
  • పోటీ ముగిసిన కొన్ని నిమిషాలకే ఛాతిలో నొప్పి అంటూ కుప్పకూలిపోయిన బాలుడు
  • ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన విద్యార్థి
  • గుండెపోటుతో విద్యార్థి మరణించినట్టు వైద్యుల వెల్లడి
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూలు పోటీల్లో తన టీం రెండో స్థానానికే పరిమితమైనందుకు విచారంలో కూరుకుపోయిన ఓ బాలుడు ఆ తరువాత కాసేపటికే గుండెపోటుతో మరణించాడు. 

జిల్లాలో ఇటీవల వివిధ స్కూళ్ల మధ్య ఆటల పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో భీమశంకర్ అనే విద్యార్థి తన టీంతో కలిసి రిలే పరుగుపందెంలో తన పాఠశాల తరపున పాల్గొన్నాడు. అయితే, ఈ పోటీలో భీమశంకర్ టీం రెండో స్థానంలో నిలిచింది. దీంతో, విద్యార్థి విచారంలో కూరుకుపోయాడు. ఆ తరువాత కొన్ని నిమిషాలకే అతడు ఛాతిలో ఇబ్బందిగా ఉందంటూ కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. 




Go Back to Shorts
Karnataka
Health

More Telugu News