Tamilisai Soundararajan: ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరికకు అడ్డుపడాలని లేదు: గవర్నర్ తమిళసై

  • ఆర్టీసీలో ప్రతి ఉద్యోగి ప్రయోజనం పొందాలనేదే ఆలోచన అన్న గవర్నర్
  • ఆర్టీసీ విలీనం ఉద్యోగుల భావోద్వేగ అంశమని వ్యాఖ్య
  • ప్రతి ఉద్యోగి ప్రయోజనం కాపాడాల్సి ఉందన్న తమిళిసై
Governor Tamilisai says Rajbhavan will not obstruct RTC bill

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆర్టీసీ విలీన ప్రక్రియకు అడ్డుపడాలనే ఉద్దేశం తనకు లేదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఆర్టీసీలో ప్రతి ఉద్యోగి ప్రయోజనం పొందాలనేదే తన ఆలోచన అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఉద్యోగులు కోరుకుంటున్న భావోద్వేగ అంశమన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడంలో అడ్డుపడాలని రాజ్ భవన్ కు లేదన్నారు. ప్రతి ఉద్యోగి ప్రయోజనం కాపాడాల్సి ఉందన్నారు.

తదుపరి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న సీఎస్ వివరణ ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తోందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీన ప్రక్రియ సాఫీగా సాగాలన్నారు. ఉద్యోగుల ఆందోళనను ప్రతిపాదిత బిల్లు పూర్తిస్థాయిలో పరిష్కరించేదిగా ఉందా? లేదా? అన్నదే ముఖ్యమన్నారు.

More Telugu News