వర్ధమాన క్రికెటర్ల కోసం హైదరాబాద్లో స్కూల్ ప్రీమియర్ లీగ్ను ప్రకటించిన ధోనీ క్రికెట్ అకాడమీ
- ఈ నెల 27 నుంచి తొలి సీజన్ పోటీలు
- 20వ తేదీన హైదరాబాద్లో సెలెక్షన్స్
- అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చిన భారత క్రికెటర్ షేక్ రషీద్
ఇలాంటి లీగ్ల్లో ఆడడం వల్ల ప్రతిభ గల క్రికెటర్లు త్వరగా వెలుగులోకి వస్తారని రషీద్ చెప్పాడు. తాను స్కూల్ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇలాంటి ఫ్రాంచైజీ లీగ్లు లేవని, ఎక్కడ టోర్నమెంట్లు జరుగుతున్నాయో, వెతుక్కుని ఆడేవాడినని తెలిపాడు. సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొని, ఈ లీగ్లో ఆడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రషీద్ కోరాడు. లీగ్లో ఆడాలనుకునే క్రీడాకారులు 7396386214, 7618703508 నంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపాడు. ధోనీ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే స్కూల్ ప్రీమియర్ లీగ్ కోసం హైదరాబాద్లోని ఎంఎస్డీసీఏ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీన సెలెక్షన్స్ను నిర్వహించనున్నారు. లీగ్లో సత్తా చాటిన ఐదుగురు టాప్ ప్లేయర్లకు ఆరు నెలల ఉచిత శిక్షణతో పాటు ఐదు లక్షల స్కాలర్ షిప్ కూడా ఇస్తారు.