Dadisetti Raja: ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా ఇంట్లో విషాదం

  • దాడిశెట్టి రాజా తల్లి సత్యనారాయణమ్మ కన్నుమూత
  • గుండెపోటుతో ఆమె మరణించినట్టు సమాచారం
  • ఆమె వయసు 66 ఏళ్లు
AP minister Dadisetti Raja mother passes away

ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి సత్యనారాయణమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆమె వయసు 66 ఏళ్లు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లి మృతి నేపథ్యంలో దాడిశెట్టి రాజాకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆమె అంత్యక్రియలు ఈ సాయంత్రం జరిగే అవకాశం ఉంది.

More Telugu News