Hyderabad District: అన్నను చంపినందుకు ప్రతీకారం.. వదినను హత్య చేసిన మరిది

Telangana Man murders his brothers wife after she killed his brother
  • కుత్బుల్లాపూర్‌ మండలం సూరారం విశ్వకర్మ కాలనీలో ఘటన
  • భర్తతో విభేదాల కారణంగా అతడిని చంపేసిన మహిళ
  • బెయిల్‌పై విడుదలైన మహిళను చంపేసిన మృతుడి సోదరుడు
హైదరాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన అన్నను చంపిందన్న కోపంతో వదినను హత్య చేశాడో యువకుడు. కుత్బుల్లాపూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. సూరారం విశ్వకర్మ కాలనీకి చెందిన సురేశ్, రేణుక 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, అయితే, తరచూ కల్లు దుకాణాల్లో మద్యం తాగే రేణుకకు ఓ రోజు దుండిగల్ తండాకు చెందిన అనాథ బాలిక పరిచయమైంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లిన రేణుక కొన్నాళ్ల తరువాత భర్తకు బాలికతో రహస్యంగా పెళ్లి కూడా చేసింది. ఈ తరువాత భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. 

ఈ క్రమంలో ఫిబ్రవరి 5న మద్యం మత్తులో నిద్రపోతున్న భర్తను రేణుక, ఆ బాలికతో కలిసి చంపేసింది. తన భర్తను మరెవరో చంపేశారంటూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో చివరకు జైలు పాలైంది. అనంతరం బెయిలుపై బయటకు వచ్చింది. ఈ క్రమంలో సురేశ్ తమ్ముడు నరేశ్ రేణుకకు మంగళవారం ఫోన్ చేసి తనకు మద్యం కోసం రూ.200 కావాలని అడిగాడు. కానీ, అందరం కలిసి మద్యం సేవిద్దామని ప్రతిపాదించిన రేణుక నరేశ్ ఇంటికెళ్లింది. అప్పటికే అక్కడ మరో ముగ్గురు ఉన్నారు. అందరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో మద్యం మత్తులో కూరుకుపోయిన రేణుకను ఆ నలుగురూ కలిసి చున్నీతో బిగించి చంపేశారు. రేణుకకు నరేశ్ చేసిన చివరి ఫోన్‌కాల్‌తో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.
Hyderabad District
Telangana
Crime News

More Telugu News