తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన సినీ నటి జయసుధ
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ చుగ్
- మోదీ చేసిన అభివృద్ధిని చూసి పార్టీలోకి వచ్చారన్న బీజేపీ నేత
- జయసుధ రాకతో బీజేపీలో మరింత ఉత్సాహం వస్తుందన్న కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జయసుధ బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించి, దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటించారన్నారు. ఆమె రాక బీజేపీకి లాభమని, బీజేపీలో మరింత ఉత్సాహం వస్తుందన్నారు. పేదల సంక్షేమం, బస్తీల అభివృద్ధి కోసం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృషి చేశారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పాలన, నియంతృత్వ పాలన పోవాలని, ప్రజాస్వామ్య పాలన రావాలని యావత్ తెలంగాణ కోరుకుంటోందన్నారు.