Chandrababu: మన భూపేశ్ రెడ్డి బుల్లెట్ లా దూసుకుపోతున్నాడు: చంద్రబాబు

  • జమ్మలమడుగులో చంద్రబాబు రోడ్ షో
  • స్థానిక ఎమ్మెల్యే తన కోసమే తాను పనిచేస్తాడన్న చంద్రబాబు
  • భూపేశ్ రెడ్డి ప్రజల కోసం పనిచేస్తాడని ప్రశంసలు
  • ఇద్దరిలో ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపు
Chandrababu attends road show in Jammalamadugu

టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు ఈ మధ్యాహ్నం కడప జిల్లా జమ్మలమడుగులో రోడ్ షోలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మలమడుగు టీడీపీ నేత భూపేశ్ రెడ్డి ప్రజల కోసం పనిచేస్తున్నాడని కొనియాడారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మాత్రం తన కోసమే తాను పనిచేస్తాడని విమర్శించారు. ఆఖరికి చికెన్ షాపులో కూడా వసూళ్లకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇంతకంటే నీచం ఉంటుందా.... మన ఎమ్మెల్యే ఇలాంటివాడంటే సిగ్గనిపించడంలేదా? అని వ్యాఖ్యానించారు. ఇద్దరిలో ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. 

ఈ రోడ్ షోలో పాల్గొన్న ప్రజల ఉత్సాహం చూస్తుంటే తనకు ఎలాంటి అనుమానం లేదని, వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో టీడీపీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. భూపేశ్ రెడ్డి బుల్లెట్ లా దూసుకుపోతున్నాడని అన్నారు. 

సీఎం బాటలోనే పలువురు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నడుస్తున్నారని, సీఎంకు దోచుకోవాలని తప్ప ప్రజలకు మేలు చేయాలని లేదని అన్నారు. ఈ ముఖ్యమంత్రి ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టాడా? ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా? అని ప్రశ్నించారు.

More Telugu News