అధికారం ఉందని లోక్ సభలో బీజేపీ ఆటలాడుతోంది: కాంగ్రెస్ ఎంపీ
- మణిపూర్ అంశంపై మళ్లీ వాయిదా పడిన సభ
- ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్షాల డిమాండ్
- ప్రభుత్వం కావాలని సభను వాయిదా వేస్తోందన్న అధిర్ రంజన్ చౌదరి
సభను వాయిదా వేయడంపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వం కావాలని లోక్ సభను వాయిదా వేసిందన్నారు. అధికారం ఉందని సభలో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కావాల్సిన బిల్లులపై చర్చ జరుపుతున్నారని, ఇందులో విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు.