వచ్చే ఎన్నికల్లో ఓడిపోయి ప్రధాని మోదీ విదేశాల్లో స్థిరపడతారు: లాలూ ప్రసాద్
- 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతానని మోదీ ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్య
- విదేశాల్లో ఆశ్రయం పొందాలని చూస్తున్నారన్న ఆర్జేడీ అధినేత
- అందుకే ఈ మధ్య ఎక్కువ విదేశాలు చుట్టొస్తున్నారని ఎద్దేవా చేసిన సీనియర్ నేత
ఈ కూటమిని ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీలు అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ స్పందించారు. ‘ప్రధాని మోదీనే దేశాన్ని వదిలేసే ఆలోచనలో ఉన్నారు. ఈ మధ్య ప్రధాని మోదీ ఇన్ని దేశాలను సందర్శించడానికి కారణం ఇదే. పిజ్జాలు, మోమోలు తింటూ ప్రశాంతంగా జీవించే ప్రదేశాన్ని వెతుకుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.