థాయిలాండ్ నుంచి ఏలూరు వచ్చి.. రూ. 3 లక్షలకు కోడిపుంజును కొన్న యువతీయువకులు!
- రంగాపురంలో కోళ్లపారం నిర్వహిస్తున్న రత్తయ్య
- రూ. 27 లక్షల పందెంలో గెలిచిన పుంజు
- దానిని విక్రయించేందుకు రత్తయ్య నిరాకరణ
- మరో పుంజును కొనుక్కెళ్లిన థాయ్ వాసులు
దానిని చూసిన థాయిలాండ్ వాసులైన ఇద్దరు యువకులు, మరో ఇద్దరు యువతులు ఆ పుంజును కొనుక్కోవాలని భావించి ఇండియాకు వచ్చారు. బుధవారం వారు రంగాపురం గ్రామానికి చేరుకుని రత్తయ్యను కలిశారు. అయితే, ఆ కోడిపుంజును అమ్మేందుకు ఆయన నిరాకరించడంతో మరో కోడిపుంజును రూ. 3 లక్షలకు కొనుగోలు చేసి తమతో తీసుకెళ్లారు. పందెంలో గెలిచిన కోడితో వారు ఫొటోలు దిగారు. ఈ వివరాలను రత్తయ్య నిన్న వెల్లడించారు.