BRS: బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇంఛార్జ్‌గా కేసీఆర్ అన్న కొడుకు

  • కల్వకుంట్ల వంశీధర్ రావుకు కీలక పదవి
  • కేసీఆర్ చైర్మన్‌గా పదిహేను మందితో తాత్కాలిక స్టీరింగ్ కమిటీ
  • కమిటీలో మహారాష్ట్రకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు
BRS appointed party Maharashtra incharge

బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇంఛార్జ్‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల వంశీధర్ రావును నియమించారు. కేసీఆర్ చైర్మన్‌గా పదిహేను మందితో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మహారాష్ట్రకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఉన్నారు. వంశీధర్ రావు కూడా స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 

మహారాష్ట్రలో ఆరు రీజియన్లకు కో-ఆర్డినేటర్లను, సహ కో-ఆర్డినేటర్లను బీఆర్ఎస్ నియమించింది. ఔరంగాబాద్, నాగ్‌పూర్, నాసిక్, పూణే, ముంబయిలు వీటిలో వున్నాయి. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంశు తివారీ వెల్లడించారు.

More Telugu News