Botsa Satyanarayana: వర్షాలకు హైదరాబాద్ సిటీయే మునిగిపోయింది: బొత్స సత్యనారాయణ

  • ప్రత్యేక సందర్భాలలో వచ్చే వర్షాలకు మునగడం సహజమేనని వ్యాఖ్య
  • చంద్రబాబు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరమన్న బొత్స
  • కుప్పం కంటే విజయనగరం చాలా బాగుంటుందన్న మంత్రి
Botsa Satyanarayana says Hyderabad also submerged in rain

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ వంటి సిటీయే మునిగిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఒకసారి ఆయన విజయనగరం వచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చూడాలని సూచించారు. కుప్పం కంటే మా జిల్లా ఎంతో బాగుంటుందన్నారు. వర్షాల నేపథ్యంలో ముంపుపై విపక్షాలు విమర్శించడం మీదా బొత్స స్పందించారు. వర్షాలకు హైదరాబాదే మునిగిపోయిందని గుర్తు చేశారు. ప్రత్యేక సందర్భాలలో వచ్చే వర్షాలకు మునగడం సహజమన్నారు. 

హైకోర్టు నోటీసులపై స్పందన

అమ్మఒడి సభకు విద్యార్థులను తీసుకువెళ్లడంపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శికి హైకోర్టు నోటీసులు ఇవ్వడంపై బొత్స స్పందించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు రావడంలో తప్పులేదన్నారు. వారు కాకుండా ఇలాంటి కార్యక్రమాలకు సినిమా యాక్టర్లు వస్తారా? అని ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రాకపై కోర్టు సూచనలు ఇస్తే పాటిస్తామన్నారు.

More Telugu News