Raghu Rama Krishna Raju: పార్లమెంటు సెంట్రల్ హాలులో రఘురామకృష్ణరాజును దూషించిన వైసీపీ ఎంపీ ఎంవీవీ

  • ఇటీవల కిడ్నాప్ కు గురైన ఎంవీవీ కుటుంబ సభ్యులు
  • ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన రఘురాజు
  • తన  కుటుంబం గురించి నీవు లేఖ ఎలా రాస్తావంటూ తిట్టిన ఎంవీవీ
MVV Satyanaraya verbal attack on Raghu Rama Krishna Raju in Parliament

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఆ పార్టీ విశాఖ ఎంపీ ఎంవీవీ అసభ్య పదజాలంతో దూషించారు. ఇటీవల ఎంవీవీ కుటుంబసభ్యులను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ కు రఘురామ లేఖ రాశారు. ఈ అంశంపైనే ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి సంబంధించిన విషయం గురించి నీవు ఎలా లేఖ రాస్తావని మండిపడ్డారు. చంపేస్తానని బెదిరించినట్టు సమాచారం. 

ఈ సమయంలో పక్కనే మరో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఎంవీవీ తిడుతున్నంత సేపు మిథున్ రెడ్డి మౌనంగానే ఉన్నారు. రఘురాజు కూడా ఎంవీవీ తిడుతుంటే మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఎంవీవీని మిథున్ రెడ్డి పక్కకు తీసుకెళ్లారు. అనంతరం ఈ ఘటనపై రఘురాజు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

More Telugu News