ఈ నెల 27న 14వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల
- ఒక్కో విడతకు రూ.2000 పెట్టుబడి సాయం
- ఆధార్, ఎన్పీసీఐ లింక్ అయిన బ్యాంకు ఖాతాలో జమ
- రాజస్థాన్ లో రైతులతో నిర్వహించే కార్యక్రమంలో నిధుల విడుదల
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత నిధులు.. ఆధార్, ఎన్పీసీఐ లింక్ అయిన బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి. కాబట్టి మీ బ్యాంకు ఖాతాకు ఆధార్, ఎన్పీసీఐ లింక్ ఉందా? లేదా? చూసుకోండి. పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ప్రకారం ఈ నెల 27న ప్రధాని మోదీ రాజస్థాన్ లో రైతులతో నిర్వహించే కార్యక్రమంలో నిధులను విడుదల చేయనన్నారు.