Air India: ఎయిరిండియా విమానంలో ఫోన్ చార్జర్ కలకలం

  • ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టులో ఘటన
  • ఢిల్లీ వెళ్లేందుకు రన్ వే పైకి చేరుకున్న విమానం
  • ఫోన్ చార్జర్ కారణంగా తిరిగి టెర్మినల్ వద్దకు విమానం తరలింపు
Air India plane returns to terminal due to a problematic phone charger

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టులో ఫోన్ చార్జర్ కారణంగా ఓ విమానం టేకాఫ్ నిలిచిపోయింది. ఉదయ్ పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం టెర్మినల్ నుంచి రన్ వే మీదకు వెళుతుండగా, విమానంలో ఫోన్ చార్జర్ కలకలం రేగింది. 

ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న ఫోన్ చార్జర్ నుంచి సమస్య ఉత్పన్నం కావడంతో ఆ విమానాన్ని రన్ వే పైనుంచి తిరిగి టెర్మినల్ వద్దకు తరలించారు. అయితే, ఫోన్ చార్జర్ లో ఎలాంటి సమస్య ఏర్పడిందన్నది తెలియరాలేదు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే బ్యాటరీల కారణంగా విమానాల్లో అగ్నిప్రమాదాలు జరిగిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఈ కారణంగానే, ఉదయ్ పూర్-ఢిల్లీ విమానం టేకాఫ్ ను నిలిపివేసి ఉంటారని భావిస్తున్నారు. 

ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతాంశమని, ప్రయాణికుడి నుంచి చార్జర్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత విమానం 40 నిమిషాల ఆలస్యంగా బయల్దేరిందని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.

More Telugu News