Kishan Reddy: నాడు మోదీతో ఉన్నప్పటి అరుదైన ఫొటోలు పంచుకున్న కిషన్ రెడ్డి

  • అమెరికా పర్యటనకు వెళ్లిన కిషన్ రెడ్డి
  • ఐరాస టూరిజం సంస్థ సదస్సులో పాల్గొనాలని కిషన్ రెడ్డికి ఆహ్వానం
  • తొలిసారి అమెరికాలో పర్యటించడాన్ని గుర్తుకు తెచ్చుకున్న కిషన్ 
Kishan Reddy shares rare pics with Modi in US

కేంద్ర పర్యాటక మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అమెరికా పర్యటనకు బయల్దేరారు. వరల్డ్ టూరిజంపై ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థ ఏర్పాటు చేసిన సదస్సుకు కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో, తాను గతంలో ఓసారి అమెరికా వెళ్లినప్పటి ఫొటోలను పంచుకున్నారు. కొన్ని దశాబ్దాల నాటి ఆ పర్యటనలో కిషన్ రెడ్డి చాలా చిన్నవాడిగా ఉండడం చూడొచ్చు. ఈ ఫొటోల్లో మోదీని చూసిన వారు కూడా ఆశ్చర్యపోతారు. ఈ ఫొటోలతో కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. 

"యూఎన్ డబ్ల్యూటీఓ సమావేశం కోసం అమెరికా చేరుకున్న సందర్భంగా నా మొదటి అమెరికా పర్యటన గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో నాతో పాటు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, దివంగత కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ తదితరులు కూడా ఉన్నారు" అని కిషన్ రెడ్డి వివరించారు.

More Telugu News