జగ్గుభాయ్‌ను ఇంటికి పంపే రోజు వచ్చింది: పవన్ కల్యాణ్

  • జగన్ భాష చూస్తుంటే చిరాకేస్తోందన్న పవన్
  • ఆయన తన పెళ్లిళ్ల దగ్గరే ఆగిపోయారని సెటైర్
  • విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తానని వ్యాఖ్య
జగన్ భాష చూస్తుంటే చిరాకేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తన వివాహాలకు సంబంధించి విడాకులు తీసుకున్నానని, కానీ జగన్ మాత్రం తన పెళ్లిళ్లను పట్టుకుని అక్కడే ఉన్నారని మండిపడ్డారు.

గురువారం తాడేపల్లిగూడెంలో జనసేన వీరమహిళలు, నాయకుల సమావేశంలో పవన్ మాట్లాడారు. తన ప్రసంగంలో ‘జగ్గూభాయ్’ అంటూ జగన్‌పై సెటైర్లు వేశారు. జగ్గుభాయ్‌ని ఇంటికి పంపే రోజు వచ్చిందని అన్నారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు.

‘‘జగన్ పదే పదే పెళ్లాం పెళ్లాం అంటుంటే.. ఆ భాష చూస్తుంటే చిరాకేస్తోంది. నా భార్యను అంటే పట్టించుకోను. నన్ను, నా కుటుంబాన్ని అన్నా నాకు కోపం రాదు. ప్రజలను అంటే మాత్రం కోపం వస్తుంది. జనసేన కార్యకర్తను ఒక మహిళా సీఐ చెంప చెళ్లుమనిపించడం చాలా బాధేసింది” అని అన్నారు.


More Telugu News

Pawan Kalyan Janasena Jagan YSRCP