గృహ నిర్మాణ నిధుల మళ్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం
- పీఎం ఆవాస్ యోజన కోసం రూ.1,879 కోట్ల విడుదల
- రూ.1,039 కోట్లు దారి మళ్లించిన ఏపీ ప్రభుత్వం
- ఈ నిధుల్ని తక్షణమే నోడల్ ఖాతాకు రీయింబర్స్ చేయాలని కేంద్రం ఆదేశాలు
రూ.1,879 కోట్ల నుండి రూ.639 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించింది. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.385 కోట్లతో పాటు రూ.113 కోట్ల మేర బిల్లులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ బకాయి పెట్టింది. ప్రస్తుతం ఉమ్మడిగా నిర్వహించే సింగిల్ నోడల్ ఖాతాలో కేవలం రూ.1.5 కోట్లు ఉన్నాయి. మరోవైపు పీఎం ఆవాస్ యోజనకు రాష్ట్రం వాటాగా రావాల్సిన రూ.221 కోట్లను ఇవ్వలేదు. దీంతో కేంద్రం రూ.1,174 కోట్ల నిధులను నిలిపివేసింది. మరోవైపు, రూ.42.71 కోట్ల పెండింగ్ బిల్లులు నిలిచిపోవడంతో 211 లే-అవుట్లలో నీటి సరఫరా పనులు నిలిచిపోయాయి.