Ranjitha: నిత్యానంద దేశానికి ప్రధానిగా రంజిత!

  • సొంతంగా కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద
  • తన ప్రియ శిష్యురాలు రంజితను ప్రధానిగా ప్రకటించినట్టు వార్తలు
  • తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన రంజిత
Ranjitha is Prime Minister of Nityananda country

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి దేశం నుంచి పారిపోయి సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి కైలాస (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస) దేశంగా పేరు పెట్టుకున్నాడు. ఆ దేశానికి ప్రత్యేక కరెన్సీ, పాలన విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచాడు. తన ప్రియ శిష్యురాలు, సినీ నటి రంజితను కైలాస దేశానికి ప్రధానిగా ప్రకటించాడు. ఈ మేరకు ఒక ప్రముఖ తమిళ పత్రిక వెల్లడించింది.

రంజిత పలు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె కెరీర్ గొప్పగా ఉన్న సమయంలోనే నిత్యానంద వద్దకు చేరింది. నిత్యానంద, రంజిత మధ్య శారీరక సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా గతంలో పెద్ద ఎత్తున జరిగింది.

More Telugu News