Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 33 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 10 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in losses

స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో, చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 65,446కి పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 19,398కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: 
మారుతి (3.61%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.38%), టెక్ మహీంద్రా (2.37%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.03%), ఐటీసీ (1.90%). 

టాప్ లూజర్స్:     
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.20%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.93%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.80%), విప్రో (-0.57%), టాటా మోటార్స్ (-0.50%).

More Telugu News