భీమవరం సభ మధ్యలోకి వచ్చేసిన అంబులెన్స్... అందులో నిజంగానే పేషెంట్లు ఉన్నారా? అని అడిగిన పవన్

An ambulance enters into Pawan Kalyan rally in Bhimavaram
జనసేనాని పవన్ కల్యాణ్ భీమవరంలో వారాహి విజయ యాత్ర సభ నిర్వహిస్తుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎంపీ రఘురామకృష్ణరాజు గురించి పవన్ మాట్లాడుతుండగా, సభ మధ్యలోకి ఓ అంబులెన్స్ ప్రవేశించింది. పవన్ సభకు భారీగా వచ్చిన జనసందోహం మధ్యలోంచి ఆ అంబులెన్స్ నిదానంగా కదులుతుండడం గమనించిన పవన్ ఒక్కసారిగా తన ప్రసంగాన్ని ఆపేశారు. అంబులెన్స్ ను వెళ్లనివ్వండి అంటూ కార్యకర్తలకు సూచించారు. ఆ అంబులెన్స్ నిదానంగా వెళుతుండగా, పవన్ స్పందిస్తూ... నిజంగానే అందులో పేషెంట్లు ఉన్నారా? అని పలుమార్లు అడిగారు. అందులో పేషెంట్లు లేరా?... అంటూ నవ్వుతూ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Go Back to Shorts
Ambulance
Pawan Kalyan
Bhimavaram
Janasena

More Telugu News