సబ్ జైలు నుంచి విడుదలైన జనసేన నేత కోటా చంద్రబాబు
- చిందేపల్లి రోడ్డు సమస్యపై ఆందోళన చేయడంతో కేసు
- శ్రీకాళహస్తి సబ్ జైల్లో 14 రోజులు రిమాండ్ లో ఉన్న కోటా చంద్రబాబు
- జైలు వద్దకు భారీగా తరలివచ్చిన జనసైనికులు
అయితే 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని చెపుతూ జైలు వద్దకు భారీగా తరలివచ్చిన జనసైనికులను పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. జైలు వద్ద నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో జనసేన శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో జనసైనికులపై పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు. మరోవైపు జైలు నుంచి ఓపెన్ టాప్ వాహనంలో వెళ్లిన చంద్రబాబు, వినుతలను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు కోటా దంపతులు తమ నివాసానికి చేరుకున్నారు.