జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు: గంటా శ్రీనివాసరావు
- అమ్మఒడి పథకంలో జగన్ మాట తప్పారన్న గంటా
- సగం మందికే డబ్బులు ఇచ్చారని విమర్శ
- టీడీపీ బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందని వ్యాఖ్య
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గంటా అన్నారు. విశాఖ ఎంపీ సభ్యులనే కిడ్నాప్ చేయడం దీనికి ఉదాహరణ అని చెప్పారు. టీడీపీ చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేసి మళ్లీ సీఎం చేయాలని ప్రజలు ఉత్సుకతతో ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు గుడ్ బై చెపుతారని అన్నారు.