తెలంగాణ సమాజం గొప్ప గాయకుడిని, కళాకారుడిని కోల్పోయింది: సీఎం కేసీఆర్
- సాయిచంద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
- ఆయన లేకుండా తన సభలు ఉండేవి కావన్న సీఎం
- సాయిచంద్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను, చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్ఫూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని సీఎం అన్నారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని ప్రకటించారు.