పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో ఎప్పుడు చేరనున్నారో చెప్పిన ఠాక్రే
- జులై 2న ఖమ్మంలో మల్లుభట్టి పాదయాత్ర ముగింపు సభ
- రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ
- అదే సభలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్న పొంగులేటి
పీపుల్స్ మార్చ్ ను విజయవంతంగా ముగించిన భట్టిని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అదే సభలో ఘనంగా సత్కరిస్తారన్నారు. ఆ సమయంలోనే పొంగులేటి పార్టీలో చేరుతారన్నారు. మల్లుభట్టి పాదయాత్ర విజయవంతమైందని, ప్రజల నుండి మంచి స్పందన వచ్చినట్లు మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. మల్లుభట్టికి స్వాగతం పలికే వారిలో పొంగులేటి కూడా ఉంటారన్నారు. కాగా, ఖమ్మం జిల్లాలో నిర్వహించే బహిరంగ సభపై ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ పొంగులేటిలు సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరు చర్చించారు.