కుప్పంలో తెల్లవారుజామున ఓ ఇంట్లో నాటు బాంబు పేలుడు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు
- పేలుడు ధాటికి ధ్వంసమైన ఇల్లు
- ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మురుగేశ్, ధనలక్ష్మి దంపతులు
- గుర్తు తెలియని వ్యక్తులు బాంబును పేల్చారంటున్న స్థానికులు
వెంటనే స్థానికులు పేలుడు గురించి కుప్పం పోలీసులకు సమాచారం అందించారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. మరోవైపు పేలుడుపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పేలింది నాటుబాంబా? లేక జిలెటిన్ స్టిక్సా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపు ముందు నాటు బాంబును పేల్చినట్టు కొందరు చెపుతున్నారు. కుప్పంలో వారం వ్యవధిలో పేలుళ్లు జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.