WTC Final: వ్యూయర్స్ పరంగా రికార్డు సృష్టించిన డబ్ల్యూటీసీ ఫైనల్

  • లండన్ లో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్
  • ఓవల్ మైదానంలో మ్యాచ్
  • 209 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓడిన భారత్
  • భారత్ లో ఈ మ్యాచ్ ను టీవీల్లో వీక్షించిన వారి సంఖ్య 123.6 మిలియన్లు
WTC Final set viewership record in India

లండన్ లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టు 209 పరుగుల భారీ తేడాతో నెగ్గి ఐసీసీ గదను సొంతం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్ టెలివిజన్ వ్యూయర్స్ పరంగా రికార్డు సృష్టించింది. భారత్ లో బుల్లితెరపై డబ్ల్యూటీసీ ఫైనల్ ను 123.6 మిలియన్ల మంది వీక్షించారు. భారత్ లో మరే టెస్టు మ్యాచ్ ను ఇంతమంది వీక్షించలేదు. ఈ టెస్టు చాంపియన్ షిప్ సమరాన్ని మొత్తం 14.4 బిలియన్ల నిమిషాల పాటు తిలకించారు. ఈ మ్యాచ్ ను భారత్ లో స్టార్ స్పోర్ట్స్ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

More Telugu News