Jagan: బయో ఇథనాల్ ప్లాంట్లకు శంకుస్థాపన చేసిన జగన్

  • నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్లు
  • వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
  • ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురుచూస్తున్నామన్న కాకాణి 
Jagan land breaking ceremony for bio ethanol plant

నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో నిర్మించనున్న రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్లకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. తన కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్ నాథ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. రూ. 925 కోట్ల వ్యవయంతో ఈ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. క్రిబ్కో విశ్వసముద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్లాంట్లను నిర్మిస్తున్నారు. వీటి వల్ల స్థానికంగా ఉన్న దాదాపు 75 శాతం యుతకు ఉపాధి లభిస్తుంది. 

శంకుస్థాపన అనంతరం కాకాణి గోవర్ధన్ మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చొరవతో పరిశ్రమలకు శంకుస్థాపన చేసుకోగలిగామని అన్నారు. ప్లాంట్లకు కావాల్సిన భూమిని సమకూర్చిన వారికి పరిహారం ఇచ్చామని చెప్పారు. ఈ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి పరిశ్రమ యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు.

More Telugu News