జగన్ వల్ల మా సినిమాలకు రూ. 30 కోట్ల నష్టం వచ్చింది: పవన్ కల్యాణ్

  • తన సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు తగ్గించారన్న పవన్
  • దీని వల్ల సినిమా హిట్ అయినప్పటికీ నిర్మాతలకు నష్టం వచ్చిందని మండిపాటు
  • నిర్మాతల నష్టాన్ని తానే భరించానని వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలు తగ్గించడం, థియేటర్లపై ఆంక్షలు విధించడం, థియేటర్ల వద్ద అధికారులను పెట్టడం వంటివి చేయించారని ఆయన మండిపడ్డారు. జగన్ చేసిన ఈ పనుల వల్ల తన సినిమాలు హిట్ అయినప్పటికీ... ఏపీలో నిర్మాతలకు రూ. 30 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు. ఆ నష్టాన్ని తానే భరించానని చెప్పారు. 

ఇక, పవన్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే 'బ్రో' సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాల షూటింగులు జరుగుతున్నాయి. 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో కూడా త్వరలోనే పాల్గొననున్నారు. మరో రెండు, మూడు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.


More Telugu News

Pawan Kalyan Janasena Tollywood Jagan YSRCP