H-1B Visa: ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ఎన్నారైల కష్టాలకు త్వరలో ముగింపు

  • హెచ్-1బీ వీసా రెన్యూవల్ విధానాన్ని మరింత సరళీకరించే దిశగా అగ్రరాజ్యం
  • స్వదేశానికి వెళ్లకుండానే వీసా రెన్యూ చేసుకునేందుకు ఎన్నారైలకు అవకాశం
  • ఈ దిశగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్న అమెరికా
  • త్వరలో దీనిపై విస్పష్ట ప్రకటన విడుదల కానున్నట్టు సంబంధిత వర్గాల వెల్లడి
US to ease visas for skilled Indian workers as PM Modi visits

భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అక్కడి ఎన్నారైలకు ఓ గుడ్ న్యూస్! త్వరలో భారతీయుల వీసా కష్టాలు తీరనున్నాయి. హెచ్-1బీ వీసా రెన్యూవల్‌ విధానాన్ని మరింతగా సరళీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ దిశగా త్వరలో ఓ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించబోతోందని, ఇందులో భాగంగా స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎన్నారైలు తమ వీసాలను రెన్యూవల్ చేసుకునే అవకాశం దక్కనుందని సమాచారం. 

పైలట్ ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా కొద్ది మంది విదేశీయులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఈ విషయమై నేడే అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. హెచ్-1బీ వీసాదారుల్లో మెజారిటీ భారతీయులేనన్న విషయం తెలిసిందే. గతేడాది జారీ అయిన 4.42 లక్షల హెచ్-1బీ వీసాల్లో అత్యధికం భారతీయులే దక్కించుకున్నారు.

More Telugu News