Balakrishna: బాలయ్య లైన్లో పెట్టిన నలుగురు దర్శకులు వీరే!

  • 'భగవంత్ కేసరి' షూటింగులో బాలయ్య 
  • ఆ తరువాత సినిమా బాబీ దర్శకత్వంలో 
  • బోయపాటితో నాలుగో సినిమా చేయడానికి రెడీ 
  • లైన్లోనే ఉన్న శ్రీవశిష్ఠ .. పరశురామ్   
Balakrishna  upcoming movies update

బాలకృష్ణ అభిమానులంతా ఇప్పుడు 'భగవంత్ కేసరి' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుంటూ ఉండగానే, బాలయ్య మరో నలుగురు దర్శకులను లైన్లో పెట్టేశారు. 

'భగవంత్ కేసరి' తరువాత బాబీ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు. ఇది కూడా యాక్షన్ ప్రధానంగా నడిచే కథనే. సితార నాగవంశీ - సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ తరువాత సినిమాను బోయపాటితో చేయనున్నారు. 14 రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, పొలిటికల్ నేపథ్యంలో కొనసాగుతుందని అంటారు. 

ఈ సినిమా తరువాత శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. 'బింబిసార'తో మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు, బాలయ్య సినిమాను గీతా ఆర్ట్స్ పై చేయనున్నాడు. ఇక ఆ తరువాత సినిమాను పరశురామ్ దర్శకత్వంలో బాలయ్య చేయనున్నాడని చెబుతున్నారు. ఇలా వరుస సినిమాలతో బాలయ్య యంగ్ హీరోలతో పోటీపడుతుండటం విశేషం. 

More Telugu News