Patliputra Express: 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడిన ప్రయాణికుడు!

  • ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఘటన
  • రైలు నుంచి కిందపడి 100 మీటర్ల పాటు జారిన వైనం
  • చిన్న గాయం కూడా కాకుండా బయటపడిన యువకుడు
Passenger Skids From Patliputra Express Train

అత్యంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. 

పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా ప్రయాణికుడు ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాంపై జారిపడ్డాడు. ఆ వేగానికి అలాగే రైలుతోపాటు 100 మీటర్ల వరకు ముందుకు జారుతూ వెళ్లాడు. ఆ తర్వాత లేచి దులుపుకుని వెళ్లిపోయాడు. అంత వేగంగా కిందపడినా ఎలాంటి గాయాలు కాకుండా వెంటనే లేచి వెళ్లిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

More Telugu News