Mahesh Babu: మహేశ్ మూవీపై ఇప్పుడు హల్ చల్ చేస్తున్న రూమర్ ఇదే!

  • మహేశ్ హీరోగా రూపొందుతున్న 'గుంటూరుకారం'
  • షూటింగు విషయంలో జరుగుతున్న జాప్యం 
  • మహేశ్ బాబు అసహనంతో ఉన్నాడంటూ వార్తలు 
  • పూజ హెగ్డే తప్పుకుందని ప్రచారం 
  • తమన్ కూడా సైడ్ అయ్యాడంటూ టాక్
Trivikram and Mahesh Babu movie update

మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ను ఇటీవలే ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. సంగీత దర్శకుడిగా తమన్ ను ఎంచుకున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మహేశ్ బాబు అసంతృప్తిగా ఉండటం వలన, కొంత ఆలస్యంగానే ఇది సెట్స్ పైకి వెళ్లింది. అప్పటి నుంచి కూడా ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటున్న దాఖలాలు కనిపించలేదు. ఈ సినిమా కోసం పూజ హెగ్డే 60 రోజుల పాటు డేట్స్ కేటాయించిందట. అయితే ఆ డేట్స్ అన్నీ అయిపోయినా ఆమెతో ఒక్క సీన్ కూడా చేయలేదట. ఆ తరువాత డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలన, ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని అంటున్నారు. 

ఇక కొన్ని కారణాల వలన తమన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయనకి బదులుగా అనిరుధ్ ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. దాంతో అసలు మహేశ్ - త్రివిక్రమ్ ప్రాజెక్టులో ఏం జరుగుతోందనేది ఆసక్తికరంగా మారింది. మరి బయట జరుగుతున్న ప్రచారంలో నిజమెంతనే విషయంలో త్రివిక్రమ్ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి.

More Telugu News