Anantapur District: అర్ధరాత్రి నిద్రలో ఉన్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పటించిన దుండగులు

  • అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో శనివారం వెలుగు చూసిన ఘటన
  • ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై దుండగుల హత్యాయత్నం
  • సమీపంలో నిద్రిస్తున్న బాలికకూ తీవ్రగాయాలు
  • బాధితులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స
couple set on fire in anantapur in midnight

ఆనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో శనివారం దారుణం జరిగింది. ఆర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. సజ్జలదిన్నెలో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ ఘటనలో నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులతో పాటూ వారికి సమీపంలో నిద్రిస్తున్న పూజిత అనే బాలికకు కూడా మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

More Telugu News